ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ పంక్షన్ ని కొన్ని గంటలే ఉంది. ఈ వేడుకను హాయ్ ల్యాండ్లో జరపబోతున్నారు.. అందుకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ వేడుకకు అతిథులుగా వచ్చే వారి జాబితా కూడా ఫైనల్ అయిపోయింది. ఇక అభిమానులు కి కిరాక్ ఎక్కించే వార్త ఏంటంటే.. ఈ వేడుకకి దాదాపు మెగా హీరోలంతా అటెండ్ అవుతున్నారు. చిరు తనయుడిగా.. ఖైదీ నెంబర్ 150 నిర్మాతగా రామ్ చరణ్ పక్కాగా వస్తారు.
ఇక చరణ్… నాగబాబుతో పాటు చిరంజీవి పెట్ సన్ వరుణ్ తేజ్.. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలాగే అల్లు ఫ్యామిలీ హీరోలు ఈ వేడుకకు రాబోతున్నారు. షూటింగ్స్ కి బ్రేక్ తీసుకోని వీరంతా చిరంజీవి 150 మూవీ వేడుకలో పాల్గొనున్నారు. ఇక ఎప్పట్లాగే పవన్ కల్యాణ్ రాక మీద కొంచెం క్లారిటీ మిస్సింగ్. అయితే టెక్కలి రోడ్ షోలో ఖైదీ నెంబర్ 150 వేడుకకు మీరు వస్తారా అని ఫ్యాస్ అడిగితే తప్పకుండా వస్తా అని పవన్ అన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చే విషయంపై పాజిటివ్ బజ్ ఉంది.
మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. అభిమానులకు మెగా ఫ్యామిలీ హీరోలందరిని ఒకేసారి చూడానికి రెండు కళ్లు సరిపోవేమో. ఇక పవన్ కూడా వస్తే.. సర్ధార గబ్బర్ సింగ్ మూవీ ఆడియో వేడుకలో అన్నాదమ్ములు తీసుకొన్న సెల్ఫీకి మించిన ఫ్రేమ్ అవుతుంది ఈ వేడుక.
Related