టాలీవుడ్లో ప్రభాస్-అనుష్కల మీద వచ్చిన రూమర్స్ మరో హీరో హీరోయిన్లపై రాలేదంటే అర్థం చేసుకొవాలి వారు ఎంతలా కలిసి ఉంటారో!బాహుబలి సినిమా తరువాత ఈ జంట పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించిన వాటిని అనుష్క,ప్రభాస్లు ఇద్దరు ఖండించారు.మేము ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెప్పారు.వీరి ప్రేమ గురించి బాలీవుడ్ మీడియా కూడా కొన్ని వార్తలను రాయడంతో మళ్ళీ తెరపైకి వచ్చారు ప్రభాస్-అనుష్కలు.
ఇక ఫ్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజి బిజిగా ఉన్నాడు.సినిమా షూటింగ్ అబుదాబిలో జరుపుకుంటుంది.ఈ సినిమాలో అద్భుతమైన పోరాట దృశ్యాలు ఉండాలని, అవి హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించాలన్న ఉద్దేశంతో రూ. 90 కోట్లతో ఫైట్ సీన్ ను చిత్రీకరించారని వార్తలు కూడా వస్తున్నాయి.ఇక షూటింగ్ సమయంలో మరింత రియాల్టీ కోసం డూప్ లేకుండా ప్రభాస్ షూటింగ్ చేయగా, ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ప్రభాస్కు రెండు సార్లు గాయాలు అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న అనుష్క, హుటాహుటిన అబుదాబి వెళ్లి, ప్రభాస్కు గంటకు పైగా క్లాస్ తీసుకుందట. డూప్ లేకుండా రిస్కీ షాట్లు కూడదని, ఏదైనా జరిగితే అభిమానులు ఎంతో బాధపడతారని నచ్చజెప్పిందట.రిస్క్ షాట్స్ డూప్ సహయంతోనే చేయలని కాస్తంత గట్టిగా అనుష్క చెప్పేసరికి ప్రభాస్ సరే అన్నాడని సమాచారం.ఈ విషయంపై అనుష్క ప్రభాస్ నుండి ప్రామిస్ కూడా తీసుకుందని తెలుస్తుంది.దీని గురించి అనుష్కని అడిగితే ఒక బెస్ట్ ఫ్రెండ్ గురించి ఆలోచించడం తప్పు కాదు కదా! అని సమాధానం ఇచ్చింది.మరి వీరి మధ్య ఉన్నది ప్రేమ లేక స్నేహమో వీరే నిర్ణయించాలి.