రెబల్ స్టార్ ప్రభాస్కు అమ్మాయిల ఫాలోయింగ్ బీభత్సం. అతడికి ఏ హీరోకు లేనంత మంది లేడీ ఫాలోయింగ్ ఉంది. చివరకు ఆంటీలు కూడా అభిమానిస్తారు. మిర్చీ సినిమాలో క్లాస్, మాస్ యాక్షన్తో అమ్మాయిల మది దోచాడు. అప్పటి నుంచి లేడీస్కు నిజంగా డార్లింగ్ అయిపోయాడు. ఇక రెండు బాహుబలులతో ప్రభాస్ పరపతి బుల్లా దూసుకెళ్లింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించకున్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఉత్తర భారత అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత ప్రభాస్ అంటే పడి చస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాతో వారి సంఖ్య మరీ పెరిగిపోయింది. ఇంకా పెళ్లి కూడా కాకపోవడంతో మహిళా అభిమానం ఇంకా పెరుగుతూనే ఉంది.
అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చూస్తే.. షాక్ అవ్వాల్సిందే. ఆమె అభిమానం మిగతా మహిళా అభిమానులు ఈర్ష పడాల్సిందే. ఒక అమ్మాయి తన తెల్లటి నాజుకైన వీపుపై ప్రభాస్ ముఖాన్ని పెయింట్ గా వేయించుకుంది. వీపుపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా పెయింటింగ్ వేయించుకొని తన అభిమానాన్ని ఆ విధంగా చూపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఈ విధంగా అభిమానం ఒక్కోరికి ఒక్కోరూపంలో ఉంటోంది.