బిగ్బాస్ -2 ప్రేక్షకులను ఆకట్టుకోవంలో విఫలం అవుతుందనే వార్తలు షో మొదటి నుండి వినిపిస్తునే ఉన్నాయి.ఇక షో నుండి ఎలిమినేట్ అయినవారు బిగ్బాస్పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.అక్కడ జరుగుతుంది ఒకటి,చూపిస్తున్నది మరోకటి అని షో నుండి బయటికి వచ్చిన వారు చెబుతున్నారు.తాజాగా షో నుండి బయటికి వచ్చిన తేజస్వీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.సామ్రాట్ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అందుకే అతనికి క్లోజ్ అయ్యాను.
ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన పెళ్లితో ముడిపెడతారా? సామ్రాట్ నాకు ఎప్పటికీ మంచి ఫ్రెండే. ఎనిమిదేళ్ల క్రితమే సామ్రాట్ నాకు పరిచయం. అప్పట్లో అంత క్లోజ్ గా ఉండేవాళ్లం కాదు. అతనికి పెళ్లయిందని, ఏదో సమస్య ఉందనే విషయం హౌస్ లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. ఇక కౌశల్ ఆర్మీ గురించి కూడా చెప్పుకొచ్చింది.వాళ్లు(కౌశల్ ఆర్మీ ) నన్ను బాగా వేధిస్తున్నారని ,ట్వీట్టర్,ఫేస్బుక్లో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపింది.వారి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది తేజస్వీ.