బిగ్బాస్ రెండో సీజన్ ఫైనల్స్కు చేరుకుంది.రెండో సీజన్ ఫైనల్స్కు ఐదుగురు సభ్యులు చేరారు.కౌశల్,దీప్తి,గీతా మాధురి,సామ్రాట్,తనీష్లు బిగ్బాస్ రెండో సీజన్ ఫైనల్స్కు చేరండతో ఫైనల్స్ రసవత్తరంగా మారింది. ఈ ఐదుగురు ఫైనల్లో ఉన్న టైటిల్ రేసులో మాత్రం ఇద్దరు మాత్రమే ఉన్నారు.గీతా మాధురి,కౌశల్ వీరిద్దరిలో ఎవరో ఒకరు బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ అవుతారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.కాని విచిత్రంగా టైటిల్ రేసులో నేనున్నాను అంటు ముందుకొచ్చింది దీప్తి నల్లమోతు.అసలు దీప్తి ఫైనల్ వరకు వస్తుందని ఎవరు ఊహించలేదు.హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశల్తో మిగత ఇంటి సభ్యులు గొడవలు పెట్టుకోవడం వల్ల దీప్తి బ్రతికిపోయిందని చాలా మంది నమ్ముతున్నారు. దీప్తి ఎలిమినేషన్లో ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరు కౌశల్తో గొడవ పెట్టుకోవడం వల్ల వారు ఎలిమినేషన్ అయ్యేవారు.
కౌశల్,గీతా మాధురిలా దీప్తికి బయట పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినప్పటికి ఇక్కడి వరకు వచ్చింది అంటే మాత్రం అది ఖచ్చితంగా లక్ ఫేవరే అని చెప్పాలి.ఇక్కడి వరకు బాగానే ఉంది.మరి దీప్తి నల్లమోతు టైటిల్ రేసులోకి ఎలా వచ్చిందో ఎవరికి అర్ధం కావడం లేదు.ఫైనల్కు చేరిన దీప్తికి రోజు రోజుకి ఓట్లు శాతం పెరిగుతున్నాయి.హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన కౌశల్ కన్నా దీప్తికే ఎక్కువ ఓట్లు రావడం జరుగుతుంది.దీనిపై కౌశల్ ఆర్మీ కూడా స్పందించింది.దీప్తికి వచ్చే ఓట్లు అన్ని ఫేక్ ఐడీలతో వస్తున్నాయని కౌశల్ ఆర్మీ ఆరోపిస్తున్నారు.ఏదీ ఏమైనా దీప్తికి మాత్రం కౌశల్ కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయనేది మాత్రం నిజం.ఇది ఇలాగే కొనసాగితే దీప్తి బిగ్బాస్ రెండో సీజన్ విన్నన్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బిగ్బాస్ రెండో సీజన్ ట్యాగ్ లైన్కు తగినట్లుగానే ఏదైనా జరగొచ్చు ఏమో చూద్దాం.