Wednesday, May 22, 2024
- Advertisement -

ప్రేక్షకుల బీపీ పెంచేస్తున్న గీతా కన్నింగ్ గేమ్

- Advertisement -

ఎవరి పేరు చెబితే బిగ్ బాస్ ప్రేక్షకుల బీపీ అమాంతం పెరిగిపోతోందో ? ఎవరిని చూస్తుంటో ఛీ…అని అసహ్యించుకుంటున్నారో ? ఎవరి మాటలు వింటే కంపరమెత్తి పోతున్నారో…? ఆమే గీతామాధురి. తేజశ్వి, భానుశ్రీ, నందిని, గోగినేని, గీతామాధురి కంటే చాలా బెటర్ అనే టాక్ ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఆమెపై నడుస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మొదట్లో కౌషల్ కు గట్టి పోటీ ఇస్తుందేమో…? అని భావించిన ప్రేక్షకులు ఇప్పుడు కౌషల్ కు పోటీయా ? తొక్కా ? ఈ కీచుగొంతుకి అంత సీన్ లేదు. కౌషల్ తో పోటీ కాదు కదా, కౌషల్ దరిదాపుల్లోకి కూడా రాదు. అని తేల్చి పడేస్తున్నారు. హౌస్లో ఉన్న నలుగురైదుగురితో జట్టు కట్టేసి, కౌషల్ ను పొద్దస్తమానం టార్గెట్ చేస్తూ, కౌషల్ తుమ్మినా, దగ్గినా, నవ్వినా, ఏడ్చినా నానా రచ్చ రచ్చ చేసేసి, పదే పదే ఆయన మీద ఏడవడం తప్ప గీతా మాధురి చేసిందేం లేదు. అది కూడా కచ్చితంగా గత 42 రోజుల నుంచి ఈమె ఏ ఒక్క రోజు కూడా కౌశ‌ల్‌పై బిచ్చింగ్ చేయ‌కుండా గడిపింది లేదు. మాటాడితే చాలు కౌష‌ల్‌పై పడిపోవడం, మాటల దాడి చేయ‌డం, గొడ‌వ‌ పడటం, అవమానించడం, విసురుగా సమాధానాలు చెప్పడం, ఎగతాళిగా చూడటం, వెక్కిరించడం, రెచ్చగొట్టినట్టు మాట్లాడటం, ఇతర కంటెస్టెంట్లకు అంటున్నట్టు…కౌషల్ నుద్దేశించి ఓవర్ యాక్టింగ్ చేయడం…అసలు ఈమెను చూడాలంటేనే వాంతులు వస్తున్నట్టు బిగ్ బాస్ ప్రేక్షకులు ఫీలవుతున్నారంటే…తప్పు వారిది కాదు. పైగా చేసిందంతా చేసి, కెమెరాల ముందుకొచ్చి నేను కావాలనే కౌషల్ గురుంచి , కౌషల్ తో అలా మాట్లాడాను. అవన్నీ ఆయనపై నాకున్న అభిప్రాయాలే..అని చెప్పుకుని క్యాంపెయిన్ చేసుకోవడం. ఇతర కంటెస్టెంట్లను రెచ్చగొట్టి, కౌషల్ మీద ఉసిగొల్పడం ఇంతకుముంచి గీతా గత 42 రోజుల్లో చేసింది ఏమీ లేదు.

రాత్రయితే చాలు మంచాలపై చేరిపోయి, దండుపాళ్యం గ్యాంగ్ లాగా మళ్లీ కౌషల్ మీద చాడీలు చెప్పుకుని, కుళ్లు జోకులేసుకుని ఏడవడం ఈ పైత్యం గత 42 రోజుల్లోనే బాగా ముదిరిపోయింది. అందుకే కౌషల్ ఆర్మీ ఓ బహిరంగ సవాల్ విసిరింది. గత 42 రోజుల్లో ఏ ఒక్క రోజైనా, గంటయినా గీతా కౌషల్ మీద ఏడవడం, బిచ్చింగ్ చేయడం చేయలేదని ఎవరైనా నిరూపిస్తే ఊహకందని బహుమతి ఇస్తామని ఓపెన్ చాలెంజ్ చేసింది. అయితే కావాలనే గీతామాధురి గత 42 రోజులుగా కౌషల్ ను టార్గెట్ చేస్తోందనేది తేలిపోయింది. రీ ఎంట్రీ ఇచ్చిన శ్యామల రాజేసిన చిచ్చు ప్రభావమే గీతా చంద్రముఖిలా మారిపోవడానికి ప్రధాన కారణం. యాపిల్ టాస్కులో నువ్వు కౌషల్ తప్పు చేయలేదని చెప్పావు. అప్పటి నుంచి అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. నెంబర్ వన్ స్థానంలో అతడున్నాడు. టైటిల్ విన్నర్ అతడే అని చాలా గట్టిగానే చెప్పేసి ఉండవచ్చన్నది అర్ధమవుతోంది. పైగా రీ ఎంట్రీ సమయంలో మిగిలిన కంటెస్టెంట్ల కుటుంబీకులతో ఆమె మాట్లాడింది. అప్పుడు కూడా గీతా కుటుంబీకులు తనకు ప్రధాన పోటీ కౌషలేనని, అతడిని ఎలాగైనా బ్యాడ్ చేసేస్తే గీతా గెలుస్తుందని ఆమెకు చెప్పాలని చెప్పి మరీ పంపారని స్పష్టమవుతోంది. అందుకే కచ్చితంగా శ్యామల రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ, అంటే గత 42 రోజుల నుంచీ, గీతా పూనకం వచ్చినదానిలా ఊగిపోతు, నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కౌషల్ ను టార్గెట్ చేస్తోంది. పైగా ఆమె భర్త నందు కూడా చెవిలో అత్యంత రహస్యంగా కౌషలే ప్రధాన శతృవు, అతడిని బ్యాడ్ చేసేస్తే చాలు..అని చెప్పినట్టున్నాడు. అందుకే ఏ చిన్న అవకాశం దొరక్కపోయినా, కావాలనే కల్పించుకుని మరీ కౌషల్ ను రెచ్చగొట్టి, ఆయనతో గొడవపడి, ఆయనను ఇరిటేట్ చేస్తూ బ్యాడ్ చేయాలని ఈమె శతవిధాలా ప్రయత్నిస్తోంది.

అయితే గీతా ఎన్ని కన్నింగ్ ప్లాన్స్ వేస్తుంటే కౌషల్ కు అంత ప్లస్ పాయింట్ అవుతున్నాయి. గతంలో ఆమె నామినేట్ అయితే 30 శాతం వరకూ ఓట్లు వచ్చేవి. కానీ గత కొద్ది వారాలుగా ఆమె నామినేట్ అయితే 10 శాతం ఓట్లు కూడా పడటం లేదు. ఒకప్పుడు కౌషల్ కు పోటీ ..అనుకున్న కంటెస్టెంట్ ఇప్పుడు టాప్ ఫైవ్ లో, ఐదో స్థానంలో కూడా నిలుస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇదంతా కేవలం ఆమె యాటిట్యూడ్, బిహేవియర్, నోటిదురద వల్ల తెచ్చుకున్నదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -