తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హన్సిక. ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చిన హిట్ సినిమాలు అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలో బిజీగా హీరోయిన్ గా మారింది. హన్సిక మొత్వాని కెరీర్లో ప్రెస్టీజియస్గా భావించి చేసిన సినిమా ‘మహా’. ఈ సినిమాపై హైకోర్టులో కేసు వేశారు. అది కూడా ఎవరో కాదు.. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టరే కావడం గమనార్హం.
సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా అసిస్టెంట్ డైరెక్టర్ తో కంప్లీట్ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు, ఎడిటింగ్ కూడా తన ప్రమేయం లేకుండా జరిగిందన్నాడు. గత ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సినిమా దర్శకుడు జమీల్ సినిమా విడుదలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. ఇప్పటికే విడుదలకు ఇబ్బంది పడుతున్న హన్సిక సినిమాకు ఇప్పుడు మరో సమస్య ఎదురు కావడంతో అభిమానులు నిరాశ పడ్డారు.
భద్రతా దళాలు కాల్పుల్లో నటికీ తీవ్ర గాయాలు..?
టెన్త్, ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి : మంత్రి ఆదిమూలపు సురేశ్