టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తన వంతు బాధ్యత నిర్వర్తించడంలో ముందుంటాడు.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సమాజసేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ప్రాణ దానం చేసి రియల్ హీరో గా నిలిచాడు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకుంటున్నాడు. ఇటీవలే సీనియర్ నటి పావాల శ్యామల ఆర్థిక పరిస్థితులపై స్పందించి ఆమెకు సహాయం అందించాడు. ప్రస్తుతం కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ కల్పించడానికి తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Also read:నా పెళ్లి ఎప్పుడో నేను చెప్తా.. మీరు గుసగుసలు ఆపండి: కీర్తి సురేష్
తాజాగా కేన్సర్తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్కు మెగాస్టార్ చిరంజీవి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్ భూషణ్ కు చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు రవణం స్వామినాయుడు స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి చెక్కును అందజేశారు.కష్టాల్లో ఉన్న భరత్ భూషణ్కు సహాయం అందించినందుకు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన మంచి మనసు చాటుకున్న చిరంజీవిపై పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.
Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత