దేశంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులతోనే ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ఇప్పుడు తౌక్టే తుఫాను తో మరిన్ని కష్టాలు పడుతున్నారు. తాజాగా తౌక్టే తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ తుఫాను దాటికి ముంబై అతలాకుతలం అవుతుంది.
ఎన్నో ఇండ్లు, కార్యాయలయాలు, షాపింగ్ మాల్స్ సైతం నీటిలో మునిగిపోయాయి. ఈ తుఫాన్ ధాటికి రోడ్లపై భారీ చెట్లు విరిగిపడుతున్నాయి. తాజాగా టీవీ నటి దీపికా సింగ్ గోయల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలులకు పడిపోయింది. అయితే ఆ చెట్టు పక్కన నిల్చొని దీపికా సింగ్ ఫోటో షూట్స్ తీయించుకుంది.
ఆ తర్వాత ఫోటో షూట్స్ షేర్ చేసుకుంది. తుఫాన్ను ఆపలేమని, ఆ ప్రయత్నం చేయవద్దు అని, మనం ప్రశాంతంగా మారి, ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలని తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది. అంతే కాదు తన ఇంటి ముందు చెట్టు రాలినా ఎవరికీ ఇబ్బంది కలగలేదని చెప్పింది ఈ బ్యూటీ. అయితే దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. వర్షాలతో జనజీవితం స్తంభించి ఎన్నో కష్టాలు పడుతున్నారని.. అన్ని మునిగిపోయి ఆకలితో అలమటించి పోతున్న సమయంలో ఫోటో షూట్స్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా విషయంలో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం!