Monday, April 29, 2024
- Advertisement -

వరుస బ్లాక్ బస్టర్లు.. అంతలోనే ఫ్లాపులు అందుకే అంటున్న శ్రీను వైట్ల

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు వరుస హిట్స్ తో దూసుకు వెళ్తున్న సమయంలో హఠాత్తుగా ఫ్లాపులు ఎదురై ఢీలా పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిలో శ్రీను వైట్ల ఒకరు. రవితేజతో నీకోసం చిత్రంతో దర్శకుడిగా అడుగు పెట్టి.. ఆనందం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత సొంతం చిత్రంతో మరో విజయం అందుకున్నాడు.. ఈ చిత్రం మంచి మ్యూజికల్ హిట్ అయ్యింది. తెలుగు తెరపై దర్శకుడిగా శ్రీను వైట్ల తనదైన మార్కు వేశారు. ఆయన సినిమాల్లో యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఉంటాయి.

వెంకి,ఢీ,దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్ షా చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఆగడు, బ్రూస్ లీ తో ఘోర పరాజయాలు అందుకున్నాడు. అప్పటి నుంచి శ్రీను వైట్లకు కెరీర్ పరంగా కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే ఆయన మార్కు సినిమాలను ఇష్టపడే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఆయన నుంచి సినిమాలను వారు కోరుకుంటూనే ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మొదటి నుంచి వినోదాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాను.. దాంతో శ్రీను వైట్ల చిత్రాలు ఒకే రకంగా ఉంటాయని టాక్ వచ్చింది. దాంతో కొత్తగా చేయాలనే ఉద్దేశంతో రూట్ మార్చాను. కానీ ఆడియన్స్ మాత్రం అది రిసీవ్ చేసుకోలేకపోయారు. నా స్టైల్ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్న సమయంలో, కొత్తదనం కోసం ట్రై చేయడమే నేను చేసిన పొరపాటు అన్నారు. ఇక ముందు అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన ‘డి అండ్ డి’ చేయనున్న సంగతి తెలిసిందే.

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

కన్నడ నటుడు సంచారి విజయ్‌ ఆరోగ్యం విషమం..!

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -