విజయ్ దేవరకొండ,రష్మీక హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం గీతా గోవిందం.గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 18 కోట్లు కలెక్ట్ చేసి అందరిని షాక్ గురి చేసింది.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మూడో రోజే లాభాల బాట పట్టింది. పెట్టిన పెట్టుబడితో పాటు నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది ఈ సినిమా.
డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఈ సినిమాకి వస్తోన్న లాభాలతో సంతోషంలో తేలిపోతున్నారు. ఈసినిమాకు యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు సినిమాకు క్యూ కడుతున్నారు.ఇక మేజర్ ప్లస్ పాయింట్ హీరో విజయ్ దేవరకొండ.తన యాక్టింగ్తో థియోటర్కు వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు విజయ్ దేవరకొండ.ఇక హీరోయిన్ రష్మీక-విజయ్ల మధ్య కెమిస్ట్రీ బాగుండటంతో సినిమా ఇంతటి విజయం సాధించిదని చిత్ర యూనిట్ ఆంనందం వ్యక్తం చేసింది.
ప్రాంతాల వారీగా ఈ సినిమా వసూళ్ల వివరాలు.
నైజాం- రూ.5.01 కోట్లు
వైజాగ్ -రూ.1.34 కోట్లు
సీడెడ్ -రూ.2.01 కోట్లు
తూర్పు గోదావరి- రూ.1.09 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.0.97 కోట్లు
కృష్ణా- రూ.1.04 కోట్లు
గుంటూరు -రూ.1.20 కోట్లు
నెల్లూరు-రూ.0.44 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13.1 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా కర్ణాటకలో కోటి రూపాయలు, తమిళనాడులో 98 లక్షలు, ఓవర్సీస్ లో మూడు కోట్లు సాధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.