ఏ హీరోయిన్ కూడా అవకాశం వస్తే వదులుకోదు. ఒక హీరోతో హిట్ వస్తే.. మళ్లీ ఆ హీరోతో సినిమా చేయాలి అని ఎదురు చూస్తది. అయితే ఓ హీరోయిన్ మాత్రం.. ఆ హీరోతో నాకు బోరు కోట్టింది.. ఇక పై ఆ హీరోతో కలిసి పని చేయను అని డైరెక్ట్ గా చెప్పేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల భామ హెబ్బా. విషయంలోకి వెళ్తే.. రాజ్ తరుణ్ తో ఇప్పటికే ఎక్కువ సినిమాలు చేసేశానని.. అతను బోర్ కొట్టేస్తున్నాడని.. అతడితో ఇప్పుడిప్పుడే మళ్లీ ఓ సినిమా చేయాలనుకోవట్లేదని హెబ్బా చెప్పింది.
{loadmodule mod_custom,GA1}
రాజ్ తరుణ్ తో తొలి సినిమా చేసినప్పటితో పోలిస్తే అతడిలో చాలా మార్పు వచ్చిందని.. అదే సమయంలో అతడితో మళ్లీ మళ్లీ నటించడం వల్ల బోర్ కొట్టేస్తున్నాడని చెప్పింది. రాజ్ తో తొలిసారి ‘కుమారి 21 ఎఫ్’ చేశాను. అప్పటితో పోలిస్తే అతను వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ చాలా మారిపోయాడు. ఇప్పుడతను చాలా సౌమ్యుడిలా కనిపిస్తున్నాడు. చాలా కామ్ అయిపోయాడు. మొదట్లో అతను చాలా హైపర్. ఇప్పుడు అలా లేడు. యాక్టింగ్ పరంగా మార్పులేమీ లేవు. రాజ్ తరుణ్ తోనే కాకుండా ఇతర హీరోలతో కూడా నటించాలని అనుకొంటున్నాను.
{loadmodule mod_custom,GA2}
రాజ్ తరుణ్ తో వెంతనే ఇంకో సినిమా చేయను. ఇప్పటికే మూడు చిత్రాక్య్ చేయడం వల్ల బోర్ కొడుతున్నాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. రాజ్ తో మూడు సినిమాలు చేసినందుకు.. అతడితో ఎఫైర్ ఉంది అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఇంకో సినిమా చేస్తే.. పెళ్లి చేసేసుకున్నాం అంటారు. తర్వాత ఇంకో సినిమా చేస్తే.. పిల్లలు కూడా కనేశాం అంటారేమో.. 2015 నుంచి వరుసగా సినిమాలు చేస్తుండటంతో అలిసి పోయాను. రెండు నెలలు రెస్ట్ తీసుకొని.. మళ్లీ సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది.
{youtube}7sd6Pm9abKo{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related