రామ్ చరణ్ తేజ – ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. తమిళ సినిమా తనీ ఒరువన్ రీమేక్ ఇది. ఈ సినిమా తరవాత సుకుమార్ తో ఆ తరవాత కొరటాల శివ తో వరసగా సినిమాలు సంతకం పెట్టాడు.
అయితే కొరటాల శివ తో ఇప్పటికే ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు రెండో సినిమాకోసం ఆయన తో తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇది చరణ్ కి భారీ దెబ్బ అని చెప్పాలి. కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద విజయం దక్కించుకుందో అందరికి తెలిసిందే.
ప్రస్తుతం యంగ్ టైగర్ తో జనతా గ్యారేజ్ చేస్తున్న కొరటాల మహేష్ తో సినిమా తీసేందుకే మొగ్గు చూపుతున్నాడట. మహేష్ కూడా మురుగదాస్ తో కమిట్ అయిన సినిమా పూర్తి చేశాక ఇక కొరటాలతో మళ్లీ కలిసి చేయబోతున్నాడు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తాడని టాక్.
అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్లు ఉండబోతుందట అందుకే దానయ్యతో పాటుగా దిల్ రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు మొగ్గు చూపుతున్నాడట. మరి ఇవన్ని చూస్తుంటే చెర్రి ఓ లక్కీ ఆఫర్ మిస్ చేసుకున్నట్టే అనిపిస్తుంది.
Related