Sunday, May 19, 2024
- Advertisement -

మెగా యువహీరోలకు వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్!

- Advertisement -

టాలీవుడ్ లో ఇప్పుడు మెగా యువ హీరోలమధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ‘సరైనోడు’ సక్సెస్ పంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అభిమానులు కోరగా “చెప్పను బ్రదర్” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకేక్కాడు అల్లు అర్జున్. దీనిపై సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ బన్నీపై కోపం తెచ్చుకున్నారు.

అయితే దీనిపై తరువాత అల్లు అర్జున్ వివరణ ఇచ్చాడు. వివాదం సమసిపోయిన్దనుకున్న సమయంలో మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తిక్క ఆడియో వేడుకలో “చెబుతాను బ్రదర్” అనడంతో అల్లు అర్జున్ కు కౌంటర్ వేశాడని బన్నీ ఫ్యాన్స్ భావించి అతనిపై గుర్రుగా ఉన్నారు. తిక్క సినిమా ప్లాప్ కావడంతో తిక్క కుదిరింది బ్రదర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మేసేజ్ లు చేసారు కొంతమంది.

అయితే ఈ కామెంట్లు బన్నీ ఫ్యాన్స్ చేశారు అని పలువురు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కలిసికట్టుగా ఉన్న హీరోలు అలాగే ఉండాలని, అంతర్గత పోరు నడిపి అభిమానులు విడిపోయేలా వ్యవహరించకూడదని మెగాస్టార్ చిరంజీవి మెగా హీరోలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

Related

  1. పాపం.. సాయిధరమ్‌ను బ‌న్నీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు!
  2. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  3. సాయి కుమార్ కొడుకు భయ పడుతున్నాడు
  4. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -