Thursday, May 16, 2024
- Advertisement -

‘మెహబూబా’ ప్రీమియర్ షో టాక్‌

- Advertisement -

మొన్న‌టి వ‌ర‌కు ‘మెహబూబా’ సినిమాపై పెద్ద‌గా బ‌జ్ లేదు. స‌డ‌న్‌గా ఈ సినిమాపై పాజిటివ్ వెవ్ క‌నిపిస్తుంది.సినిమా ట్రైల‌ర్ ఆక‌ట్టుకొవ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.పైగా పూరి త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో సినిమా తీయ‌డం, సొంత నిర్మాణ సంస్థ‌లో పూరికి ఒక్క ఫ్లాప్ కూడా లేక‌పోవ‌డంతో సినిమాపై ఆశ‌క్తి నెల‌కొంది.పైగా సొంత కొడుకునే హీరోగా పెట్టి మ‌రి సినిమా తీశాడు పూరి.సినిమా ఇండియా-పాక్ బోర్డ‌ర్‌లో జ‌రిగే ల‌వ్ స్టోరీగా తెలుస్తుంది.మెహబూబా చిత్రం మే 11 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి పూరి అండ్ టీం భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో కాలేజీ విద్యార్థులకు, సెలెబ్రెటీలకు చిత్ర యూనిట్ ప్రత్యకమైన ప్రీమియర్ షో ప్రదర్శించారు. సినిమా చూసిన వారి నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.పూరి జగన్నాథ్ చాలా కాలం తరువాత మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రం తీసారని అన్నారు. 1971, 2018 కనెక్ట్ చేస్తూ ప్రేమ కథ చూపించిన విధానం చాలా బావుందని అంటున్నారు.ఈ చిత్రాన్ని చూసాక ప్రశంసించడం విశేషం. పూరి జగన్నాథ్ మనసు పెడితే అద్భుతమే జరుగుతుందని దిల్ రాజు అన్నారు.మొత్త‌నికి మెహబూబా ప్రీమియర్ షో టాక్‌తో మంచి జోష్‌లో ఉన్నారు చిత్ర యూనిట్‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -