క్రాక్ హిట్ అయిన తర్వాత మాస్ మహారాజా రవితేజ దూసుకుపోతున్నాడు. వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. లాక్ డౌన్ అనంతరం విడుదలైన క్రాక్ .. మాస్ జనాలను అలరించింది. దీంతో తనకు ఇంకా అగ్రహీరోల స్థాయిలో మార్కెట్ ఉందని మరోసారి రవితేజ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ కూడా పెంచినట్టు టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే ప్రాజెక్టుకు సైతం సైన్ చేశాడు. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మలయాళ భామ రాజీషా విజయన్ హీరోయిన్గా ఎంపికైంది. ఇప్పటికే దివ్యాంశ కౌశిక్ను కూడా ఒక హీరోయిన్ గా ఖరారు చేశారు. మొత్తానికి మాస్ మహారాజాతో ఇద్దరు భామలు స్టెప్పులు వేయనున్నారన్నమాట. వాస్తవ ఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం.
Also Read:చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!
ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా ఎంతో అలరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రవితేజ కొత్త దర్శకుడితో రామారావు ఆన్ డ్యూటీ అనే సస్పెన్స్ థ్రిల్లర్కు ఓకే చెప్పాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాస్ మహారాజా కెరీర్ మళ్లీ గాడిలో పడే చాన్స్ ఉంది.
Also Read: తమన్ కి తమనే పోటీ..!