ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నకు వరుసగా విజయాలు దక్కడంతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. లక్కీబ్యూటీగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నది రష్మిక. ఈ అమ్మడు ఏ సినిమాలో నటించినా సూపర్ హిట్ అవతోంది. దీంతో దర్శక నిర్మాతలంతా రష్మిక వెంట పడుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది.
ప్రస్తుతం తెలుగులో రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక చరణ్- శంకర్ కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలోనూ రష్మిక చాన్స్ కొట్టేసిందని టాక్. ఈ సినిమా కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ అవకాశం రష్మికకు దక్కిందట. భారీ బడ్జెట్ సినిమా కావడంతో రష్మిక కూడా ఒప్పుకుందని టాక్.
ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే.. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉంది. సెప్టెంబర్లో శంకర్-చరణ్ కాంబినేషన్లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read
బన్నీ కోసం వచ్చేస్తున్న సన్నీ..!