కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్నీల్ .. ప్రభాస్తో భారీ బడ్జెట్తో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సలార్ లో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. అయితే ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఆ మూవీ చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సలార్ షూటింగ్ మళ్లీ మొదలు కావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆ సినిమా కథలో ప్రశాంత్ నీల్ భారీగా మార్పులు చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రం పాకిస్థాన్, ఇండియా వార్ నేపథ్యంలో ఈ తెరకెక్కుతునట్టు వార్తలు వచ్చాయి. ఇందులో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. సలార్ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో భారీ మార్పులు చేస్తున్నాటరట. ప్లాష్బ్యాక్ ఎపిసోడ్ను భారీగా తగ్గించబోతున్నాడట. సలార్ నిడివి పెరగడంతో చాలా మేర తగ్గిస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్లో పలు మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్.. రాధే శ్యామ్, ఆదిపురుష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు నాగ్అశ్విన్ డైరెక్షన్లోనూ ఓ మూవీల చేస్తున్నాడు ప్రభాస్.. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ తార దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అమితాబ్ పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.
Also Read
మహేశ్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. బర్త్డేకు త్రిబుల్ ట్రీట్..!