మెగా మేనల్లుడు, సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ తన తమ్ముడికి ఓ భావోద్వేగ లేఖ రాశారు. దానిని ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఆ లేఖ లో ఏం ఉదంటే.. ‘నీ సినిమా మొత్తానికి రేపు విడుదలవుతోంది తమ్ముడు. నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నిన్న చిన్న పిల్లాడిలా ఉన్న నువ్వు పెరిగి పెద్దయి, వెండితెరపై మెరవబోతున్నావు. ఈ సమయంలో నీకు చాలా భయంగా, ఆత్రుతగా ఉంటుందని నాకు తెలుసు. నా తొలి చిత్రం విడుదలైనప్పుడు నేను పడిన కంగారు ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది.
ఇది నీ ప్రారంభం మాత్రమే, ఇకపై నీ ప్రయాణం అంత సులభంగా ఉంటుందని నేను హామీ ఇవ్వలేను. కానీ, ప్రేక్షకుల నుంచి నువ్వు ప్రేమను పొందగలవని మాత్రం చెప్పగలను. ఈరోజు నీతోపాటు మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ‘ఉప్పెన’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిన్ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నాను వైష్ణవ్’’ అని సాయి తేజ్ తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
మేలో మెగా మేనల్లుడు సాయి తేజ్ పెళ్లి!
నక్క తోక తొక్కిన టిక్టాక్ స్టార్ దుర్గారావు!