నాగ చైతన్య, సమంత ప్రేమించుకుంటున్నట్లు.. వీరి ప్రేమ విషయం బయటకు రాకముందు… అందరు వీరిద్దరు లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రావడం ఎక్కువ అవ్వడంతో.. వీరి ప్రేమ పై నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు. చైతూ, సమంత లవ లో ఉన్నట్లు తెల్చేశారు.
ఇక ఆ తర్వాత వీరిద్దరు కుటుంబ సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆక్టోబర్ లో వీరి పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నాగచైతన్య.. రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26 న ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో.. చైతన్య ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. అందులో భాగంగా చైతు మరియు రకుల్ ప్రీత్ సింగ్, కొంచెం టచ్ లో ఉంటె చెప్తా అనే టీవీ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో యాంకర్ ప్రదీప్ చైతుని.. సామ్ కి కాల్ చేయమని చెప్పాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
సరే అని చైతు కాల్ చేసి.. ఓ చిన్న డైలాగ్ వదిలాడు..! ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్న నేను సమ్ నే ఎందుకు లవ్ చేశాను అని చైతు అడగటంతో.. బికాజ్ నేను ఆప్షనే ఇవ్వలేదని సమంత చెప్పింది. అప్పుడు చైతు నాకు ఇంకో ఆప్షన్ ఉంది లే అన్నేలోపు.. సమంత ఐ లవ్ యూ అని చెప్పేసింది. దాంతో చైతు నవ్వేశాడు. ఇక ఈ రారండోయ్ వేడుక చూద్దాం సినిమా మంచి సక్సెస్ అవుతుందని.. హీరో చైతు తో పాటు ఈ సినిమాని నిర్మించిన కింగ్ నాగర్జున కూడా అంటున్నారు. మరి ఈ సినిమాతో చైతు ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.
Full on energy this Sunday 9pm on #ktuc3
Thanqsomuch? @Rakulpreet @chay_akkineni pic.twitter.com/UjMZA64TuA— Pradeep Machiraju (@impradeepmachi) May 23, 2017
{loadmodule mod_sp_social,Follow Us}
Related