జీతూ జోసెఫ్ మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయ్యి అక్కడ కూడా సక్సెస్ అయ్యిందంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో? ఆ కథతో ప్రేక్షకులు ఎంత కనెక్ట్ అయ్యారో తెలుస్తుంది. ఇక మలయాళంలో మోహన్లాల్, తమిళంలో కమల్ హాసన్ , తెలుగులో వెంకటేశ్ నటించి మెప్పించారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
అదేమిటంటే దృశ్యం సినిమా మలయాళంలో విడుదల అయి హిట్ కాగానే తమిళ, తెలుగు భాషల్లో రజనీకాంత్తో రీమేక్ చేయాలని భావించారట. అందుకు రజనీకాంత్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆఖరినిమిషంలో ఈ మూవీ రిజెక్ట్ చేశారట. కారణం ఏమిటంటే.. తమిళంలో కళైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించాలని భావించాడు. డైరెక్టర్గా మలయాళంలో తెరకెక్కించిన జీతూ జోసెఫ్నే దర్శకుడిగా అనుకున్నారు.
అయితే రజనీకాంత్ తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా తెలుగు హక్కులు వెంకటేశ్ కొనుగోలు చేశాడు. దీంతో ఈ చిత్రం కేవలం తమిళంలో విడుదల చేస్తే ఆశించిన లాభాలు రావని భావించిన రజనీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. దీంతో ఇది కమల్ హాసన్ చేతిలోకి వెళ్లిపోయింది.
ఇటీవల మలయాళంలో విడుదలైన దృశ్యం -2 కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సీక్వెల్ను కూడా మళ్లీ తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటికే వెంకీ పూర్తి చేశాడు. తమిళ దృశ్యంలో కమల్ కు జంటగా గౌతమి నటించగా.. ఈ సారి ఆమె స్థానంలో మీనా నటించబోతున్నది.
Also Read
సోనూ సూద్ .. చెర్రీ మధ్య భీకర ఫైట్..! ప్లాన్ చేసిన కొరటాల..!