తెలుగులో ప్రముఖ సీనియర్ రచయిత మరియు దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన “రాజన్న” అనే చిత్రంలో కింగ్ నాగార్జున కూతురు “మల్లమ్మ” పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ అన్నీ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బేబీ అన్నీ రాజన్న చిత్రంలో నటించడం కంటే ముందు పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ రాజన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవడంతో ఈ అమ్మడుకి మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశాలను తెచ్చిపెట్టింది. కానీ బేబీ అన్నీ మాత్రం ఈ చిత్రం తర్వాత కొంత కాలం పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి సారించింది.
కానీ ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలి పాత్రలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అవడంతో ఈ అమ్మడికి మంచి పేరొచ్చింది. ఈ మధ్య కాలంలో బేబీ అన్ని సోషల్ మీడియా మధ్య మధ్యలో బాగానే యాక్టివ్గా ఉంటూ తన అందమైన ఫోటోలని అధికారి ఇన్స్టాగ్రాం లో షేర్ చేస్తోంది. దీంతో కొందరు నెటిజనులు ఈ అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. అంతేగాక బేబీ అన్నీ హీరోయిన్ అయ్యే సమయం ఆసన్నమైందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా తాజా సమాచారం ప్రకారం బేబీ అన్నీహీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఇటీవలే ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు బేబీ అన్నీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.
మహేశ్ బాబుకు వదినగా రేణూ దేశాయ్!
టాలీవుడ్ ఫేవరెటిజంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు
5 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి, లాస్య మంజునాథ్
శ్రీరెడ్డి హాట్ షో.. ఒంటిపై బట్టలను తొలగించి ప్రైవేట్ భాగాలను చూపిస్తూ..