మెగా ఫ్యాన్స్ ఎక్కువగా చిరు.. పవన్ కళ్యాణలను ఒకే వేధిక పై.. ఒకే స్క్రీన్ పై చూడాలని ఆశపడుతుంటారు. అయితే మెగా పంక్షన్స్ లో ఎక్కువగా చిరంజీవియే కనిపిస్తూంటారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా మెగా పంక్షన్స్ కి రారు. అయితే ఇప్పుడు అభిమానులను ఓ షాకింగ్ న్యూస్ అనందపెడుతోంది. నిర్మాత కమ్ ఎంపి అయిన టి. సుబ్బిరామిరెడ్డి ఓ కొత్త చిత్రం ఎనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్ ను సంతోషపెట్టాడు.
ఖైదీ నంబర్ 150 సినిమా చూసాక.. తనకు కూడా తిరిగి సినిమాలోకి రావలనిపించింది అని ఎంపి సుబ్బిరామి రెడ్డి అన్నారు. అది కూడా చిన్న సినిమాతో కాకుండా పెద్ద సినిమా.. పెద్ద హీరోలు అయితే బాగుటుందని.. చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమాను రూపొందించాలని ఫిక్సయ్యారట. దీంతో వెంటనే డైరెక్టర్గా ఎవరైతే బాగుటుందని అనుకుని త్రివిక్రమ్ కంటే ఎవ్వరూ బెటర్ కాదని ఫీలయ్యి.. వెంటనే అతన్ని సంప్రదించారట.
ఈ రోజు మరోసారి సుబ్బిరామి రెడ్డిని కలిసిన త్రివిక్రమ్.. స్టోరీని ఓకే చేయడంతో ఈ సినిమాని అశ్వినీదత్ తో కలిసి నిర్మించనున్నట్లు ప్రకటించారు సుబ్బిరామి రెడ్డి. మొత్తానికి ఎవ్వరూ కూడా ఊహించని రీతిలో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అందరి ఇంకా షాకింగ్ లోనే ఉన్నారు. ఇక పోతే ప్రస్తుతం పవన్ కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉండగా.. 151వ సినిమాకు రెడీ అయ్యే పనిలో చిరు బిజీగా ఉన్నారు.
Related