గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు చెమటలు పట్టించిన స్మగ్లర్. 2004లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసిన ఎన్కౌంటర్లో వీరప్పన్ చనిపోయాడు. ఈయన జీవితంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. తాాజాగా వీరప్పన్ రెండో కుమార్తె విజయలక్ష్మి ప్రధాన పాత్రలో ‘మావీరన్ పిళ్లై’ అనే సినిమా రూపొందుతోంది.
కేఎస్ఆర్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవివర్మ సంగీతం, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను నిన్న విడుదల చేశారు. భుజంపై తుపాకితో సీరియస్ లుక్లో విజయలక్ష్మి కనిపించింది. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.
వీరప్పన్కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విద్యారాణి రీసెంట్గానే బీజేపీలో చేరింది. రెండవ కూతురు విజయలక్ష్మి తమిళ్వురిమై పార్టీలో చేరారు. ఈ చిత్రం వీరప్పన్ మరణం తర్వాత కొనసాగింపుగా ఉంటుందేమోనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి విజయలక్ష్మి సినీ రంగంలో ఎలా రాణిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా 1,078 కేసులు!
దారుణం.. గోదావరిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి!