Tuesday, May 21, 2024
- Advertisement -

టాలీవుడ్‏లో మరో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత!

- Advertisement -

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. రోజుకు వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది. గత కొన్ని రోజులుగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇక కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే చూపిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా..తాజాగా మరో డైరెక్టర్ ఈ మహమ్మారికి బలయ్యారు.

యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ కుమార్ వట్టి. గత కొన్ని రోజులుగా కుమార్ వట్టి కరోనాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు కుమార్ వట్టి. ఈయన మొదటగా పరుశురాం వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. పరుశురాం తెరకెక్కించిన యువత సినిమా కోసం వట్టి కుమార్ ఆయన దగ్గర పనిచేశారు.

వట్టికుమార్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందినవారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న కుమార్ వట్టి నిన్న మరణించారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్లాస్మా ఎక్కించారు. ఇక ఆ తర్వాత ఆయన మరణించినట్టుగా సన్నిహితులు తెలిపారు. ఆయన మరణ వార్త విన్న ప్రముఖులు వట్టి కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్ధిస్తున్నారు.

లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

గుజరాత్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 18 మంది రోగుల సజీవ దహనం!

నేటి పంచాంగం, శనివారం (1-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -