ప్రస్తుతం టాలీవుడ్ లో కీర్తి సురేష్ టాప్ టాప్ పొజీషన్ లో లేకున్న.. ఒక మోస్తారు హీరోయిన్ రేసు లో మాత్రం ఉందని చెప్పవచ్చు. కీర్తి సురేష్ ఇటీవల నటించిన నేను శైలజ, నేను లోకల్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయంను సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసిందట.
చేసిన రెండు సినిమాలతోనే ప్రేక్షకుల చూపుల్ని ఆకర్షించిన ఈ భామ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే మూవీలో అవకాశం సంపాధించింది. ఈ మూవీ కోసం దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుండటం వలన.. షూటింగ్ కి ఎక్కువ టైం తీసుకోనుండటం వలన ఆమె అంత అడిగిందట. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత తీయబోయే సినిమాలకు కూడా కీర్తి అంతే డిమాండ్ చేయాలని అనుకుంటుందట.
అమ్మడు అడిగే మొత్తం నయనతార పారితోషికానికి దగ్గరగా ఉండటంతో, దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారట. అయితే వెలుగు ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని ఆ ముద్దు గుమ్మ ఫాలో అవుతున్నట్టు ఉంది. ఓకే వేళ కీర్తి సురేష్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే గనుక అప్పుడు ఖచ్చితంగా తన రెమ్యునరేషన్ తగ్గించాల్సి వస్తుందని సినిమా వర్గాల టాక్.
{youtube}an6llJhGEug{/youtube}
Related