జయసుధ భర్త నితిన్ కపూర్ ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇంట్లో వాకింగ్ కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి కొద్దిసేపటికే అపార్ట్ మెంట్ కింద శవమై కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న జయసుధ వెంటనే హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరారు.
అయితే ఈ ఘటన జరగక ముందు ఏం జరిగిందో అనే విషయాన్ని అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న ఓ వ్యక్తి ఈ విధంగా వివరించాడు. ఎప్పుడూ టెరాస్ కు లాక్ వేసే ఉంటుందని తెలిపాడు. నితిన్ మంగళవారం తనకు కనిపించారని.. నవ్వుతూ పలకరించారని కూడా ఆ అపార్ట్ మెంట్ వాసి చెప్పాడు. అయితే కొద్దిసేపటికి తాను ఇంట్లోకి వెళ్లానని.. ఇంతలో బయట కేకలు, ఏడుపులు వినిపించాయని తెలిపాడు.
ఏం జరిగిందో అని చూడగా నితిన్ కపూర్ రక్తపుమడుగులో కనిపించారని తెలిపాడు. లాక్ ను పగలగొట్టి టెరాస్ డోర్ ను బద్దలుకొట్టినట్లు పైకెళ్లి చూడగ కనిపించిందని ఆ వ్యక్తి తెలిపాడు. ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని అదే అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న ఓ వ్యక్తి తెలిపాడు.
Related