టాలీవుడ్ లో హీరోయిన్గా ఆకట్టుకుని.. ఇప్పుడు అమ్మ పాత్రల్లో ఆకట్టుకుంటున్న జయసుధ భర్త నితిన్ కపూర్ తాజాగా ముంబయిలోని ఒక అపార్ట్మెంట్ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జయసుధ భర్త నితిన్ కపూర్ లకు ఇద్దరు కుమారులు ఉన్నారు. జయసుధ దంపతులకు కొన్ని ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ఉండటం వల్ల జయసుధ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే ఆ విషయాన్ని జయసుధకు సన్నిహితుడు అయిన మోహన్బాబు కొట్టి పారేశాడు. నితిన్ కపూర్ చనిపోయినప్పటి నుండి కూడా మీడియాలో ఆర్థిక ఇబ్బందులు కారణం అంటూ కథనాలు వస్తున్నాయి. ఆ వార్తలు జయసుధ దృష్టికి వెళ్లినట్లుగా సమాచారం. దాంతో జయసుధ మోహన్బాబుకు ఫోన్ చేసి మీడియాలో ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మీరైనా మీడియాతో చెప్పండి, మీడియాలో ఆ వార్తలు చూస్తే నాకు ఇబ్బందిగా ఉంది అని జయసుధ మోహన్బాబుతో ఫోన్లో చెప్పుకొచ్చిందట. దాంటో మోహన్ బాబు తాజాగా ఒక మీడియా సంస్థతో ఫోన్లో మాట్లాడి జయసుధ భర్త ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోలేదని చెప్పుకొచ్చాడు. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మోహన్బాబు తెలిపారు. మరి నితిన్ కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అనేది మాత్రం ఆయన వెళ్లడి చేయలేదు.
{youtube}v=gDmDP8wUupg{/youtube}
Related