Wednesday, May 8, 2024
- Advertisement -

బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్.. యాంకర్ ప్రదీప్‌తో వారు కూడా ఉన్నారు..!

- Advertisement -

ప్రముఖ యాంకర్, నటుడు, కమెడియన్ బిత్తిరి సత్తి కరోనావైరస్ బారిన పడ్డారు. ఆయన అస్వస్థతకు లోను కావడంతో కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన క్వారంటైన్ లోకి వెళ్లారు. గత కొద్దిరోజులుగా జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో సత్తి బాధపడుతున్నాడట. అందుకే కరోనా టెస్టుల చేయించుకోవడంతో పాజిటివ్ వచ్చిందట.

ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పాడు. అయితే బిత్తిరి సత్తి సాక్షిలో చేరిన విషయం తెలిసిందే. గరం గరం వార్తలు పేరుతో ఓ షో చేస్తున్నారు. కేవలం బిత్తిరి సత్తికే కాకుండా ఆ టీమ్‌లోని కీలక వ్యక్తులకు కూడా కరోనా సోకింది. దాంతో వారందరూ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవలే వంగపండు ప్రసాదరావు మరణించన నేపథ్యంలో దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తితో బిత్తిరి సత్తి ముఖాముఖి నిర్వహించారు. అలా పలువురిని కొన్ని ఎపిసోడ్స్‌లో కలిసి కార్యక్రమాలను చేశారు.

అంతేకాకుండా ఇటీవల మా టెలివిజన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు బిత్తిరి సత్తి హాజరయ్యారు. ఆయనతోపాటు యాంకర్ ప్రదీప్, ఇతర సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరయ్యారు. దాంతో ఈ వేడుకకు హాజరైన వారు కరోనా భయాలతో ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల కాలంలో బిత్తిరి సత్తిని కలిసిన వారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సన్నిహితులు చెబుతున్నారు.

‘పవర్ స్టార్’ సినిమా వల్ల వర్మకి ఎంత లాభామో తెలుసా ?

నిజం సినిమాలో నన్ను మోసం చేసి ఆ సీన్స్ తీశారు : రాశీ

నా భర్త పెద్ద సైకో.. నన్ను టార్చర్ పెడుతున్నాడు : స్వాతి నాయుడు

ఛాన్స్ ఇస్తానని అమ్మా రాజశేఖర్ నన్ను వాడుకున్నాడు : జబర్తస్త్ పవన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -