జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు అంజలి, హీరో జై. ఆ సినిమా మంచి హిట్ కావడంతో వీరిద్దరికి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా అంజలి టాలీవుడ్లో జెండా పాతింది. కాని జై మాత్రం కోలీవుడ్కే పరిమితమయ్యాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంట ఓ తమిళ సినిమా చేస్తోంది. బెలూన్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకి సినీష్ అనే కొత్త దర్శకుడు.. డైరెక్ట్ చేస్తున్నాడు.
హర్రర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో జై మూడు వేరియేషన్లలో కనిపిస్తాడట. దీనిని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. తమిళ్ వరకు పర్లేదు కాని తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సినిమాలో ఏదో స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి. అందుకే ఈ మూవీలో ఓ తెలుగు స్టార్తో చిన్న కామియో రోల్ చేయించాలనుకున్నాడట డైరెక్టర్ సినీష్. దీనిలో భాగంగా యంగ్హీరో రాజ్తరుణ్ని కలిసి రిక్వెస్ట్ చేశాడట. దీనికి ఓకే అన్న రాజ్, రీసెంట్గా చెన్నై వెళ్లి ఒక రోజు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి వచ్చేశాడట. అసలు అతిథి పాత్రలు చేయనని చెప్పిన తరుణ్ ఎవరి కోసం..ఎందుకోసం ఒప్పుకున్నాడోనని ఫిల్మ్నగర్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.
{youtube}4FQKAgm5WRQ{/youtube}
Related