సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ 11వ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సమంత రూపంలో గట్టి దెబ్బ పడ్డది. వీలైనంత త్వరగా షెడ్యూల్ని ముగించి, ఇతర కార్యక్రమాలు చకచకా కానిచ్చేద్దామనుకుంటే.. ఆ హీరోయిన్ కారణంగా అన్ని ఆపేయాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ పక్కనపెట్టేయాల్సి వచ్చింది.
ఇంతకీ సమంత ఏం చేసిందనుకుంటున్నారా.. వాస్తవానికి ఆమె తప్పు కూడా లేదు కానీ, షూటింగ్ ఆగిపోవడానికి కారణం మాత్రం సమంతనే. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోనసీమ ఏరియాల్లో జరుగుతోంది. భగభగ మండే సూర్యుడి తాపాన్ని కూడా లెక్కచేయకుండా, సినిమా బెస్ట్ ఔట్పుట్ కోసం యూనిట్ మొత్తం తీవ్రంగా శ్రమిస్తోంది. చరణ్, సమంతలు సైతం మండుటెండల్లో షూట్లో పాల్గొంటున్నారు. అయితే.. ఎండతాపం మరీ ఎక్కువ కావడం వల్ల సమంత ‘వడదెబ్బ’కు గురయ్యింది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఆమె ఉష్ణోగ్రతని తట్టుకోలేకపోయింది. దీంతో.. వెంటనే ఆమెకు చికిత్స అందించారు. రెండురోజులపాటు ఆమె బాగోగుల గురించి చూసుకున్నారు. అప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో.. షూటింగ్ని అర్థంతరంగా ఆపేయాల్సి వచ్చింది. సమంత పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. ఉన్నట్లుండి షూటింగ్ని ఆపేయడంతో చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫ్యాన్స్, సాధారణ ప్రజలతో సమయం గడుపుతున్నాడు. ఇందులో చెర్రీ చేపలు పట్టేవాడిగా నటిస్తున్నాడని, అతడి క్యారెక్టర్ పేరు చిట్టిబాబు అని తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}El-Dn8eZUwc{/youtube}
Related