టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవర కొండకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్. గీతగోవిందం సినిమా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా చెప్పుకోదగిన స్థాయిలో అవి విజయం సాధించలేదు.
కానీ ఈ రౌడీ హీరో రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల థమ్స్ అప్ యాడ్ లోనూ నటించే బంపర్ ఆఫర్ ను కొల్లగొట్టాడు. చిరంజీవి, మహేష్ బాబుల తర్వాత ఈ యాడ్ లో నటించిన హీరో విజయ్ కావడం విశేషం. కాగా ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను చార్మి, కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. దాదాపు రూ.20 కోట్లు పారితోషికం అందుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఇప్పుడున్న యువ హీరోలలో ఇంతమొత్తంలో పారితోషికం తీసుకుటున్నది విజయ్ మాత్రమే. కాగా లైగర్ తర్వాత మరికొంద మంది నిర్మాతలు విజయ్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్