నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు మందు ఇస్తున్నారని తెలుసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కొన్ని రోజుల క్రితం ఆ మందు వేయించుకున్న విషయం తెలిసిందే. తన ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాలేదని.. ఎప్పుడైతే ఆనందయ్య మందు వాడానో క్షణాల్లో తనకు నయం అయ్యిందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది.
తాజాగా కరోనా మహమ్మారితో పోరాడుతూ రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఆనందయ్య దగ్గర మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆనందయ్య దగ్గర తీసుకున్న కంటి చుక్కల మందు తో రెండు నిమిషాల్లో తాను లేచి కూర్చున్నానని, ఆక్సిజన్ లెవెల్స్ సైతం పెరిగాయని రిటర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చెప్పిన వీడియో ఏపీ, తెలంగాణలో పాటు దేశ వ్యాప్తంగా తెగ హల్ చల్ చేసింది.
అయితే ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయినట్టు అనిపించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఒకదశలో ఆనందయ్య మందు వికటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కథనాలు కూడా వచ్చాయి. ఇంతకాలం ఆస్పత్రిలో చికిత్స పొందిన కోటయ్య.. ఇవాళ ఉదయం చనిపోగా.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లినట్టు సమాచారం.
మరోవైపు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం పూర్తి చేసింది. ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. ఆనందయ్య వినియోగిస్తున్న పదార్థాలు శాస్త్రీయంగానే ఉన్నాయని రాములు అభిప్రాయపడ్డారు. ఆనందయ్య మందు కోసం ఇప్పటికీ జనాలు కృష్ణపట్నం వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించారు.
తగ్గేదే లే అంటున్న రాందేవ్ బాబా!
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు.. మహేష్ బాబు ఎమోషనల్ ట్విట్!