గత ఏడాది నుంచి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. కోట్ల మదికి కరోనా వైరస్ సోకింది.. లక్షల్లో మరణాలు సంబవించాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. కరోనా మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ బిభత్సాన్నే సృష్టించింది. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో కరోనా భయాందోళనలను రేకెత్తించింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మంది కరోనా బారిన పడ్డారు.
ఈ విషయాన్ని డీఎంహెచోఓ తెలిపారు. ఆ మద్య సూర్యాపేటలో కరోనా మరణాలు వరుసగా సంబవించాయి. ఒక కొంత కాలంగా కేసులు తగ్గుతున్నాయన్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఈ మద్య బాధితుల్లో ఒకరు అంత్యక్రియలకు వెళ్లి వచ్చారని.. ఆ తర్వాత కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి కోవిడ్ పాజిటవ్ కేసులు వచ్చాయని.. వీరిలో కరోనా లక్షణాలు పెద్దగా లేవని, పరీక్షలు నిర్వహించిన తర్వాతే కరోనా అని తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీరికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారని తెలిపారు.
చైనాలో తొలి కరోనా స్ట్రెయిన్.. పరిగెడుతున్న జనాలు..!
గుడ్ న్యూస్ చెప్పిన మోదీ.. స్వదేశీ టీకా వచ్చేస్తుంది..!