- Advertisement -
ఓ స్కూల్ హెడ్మాస్టారు ఈ మధ్యే రిటైర్ అయ్యాడు. అతనికి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు అన్ని అతనికి తెలియకుండానే సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..?ఇంట్లో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని… కస్టమర్ సర్వీస్కు ఫోన్ చేద్దామని గూగుల్లో నంబర్ వెతికి తీసుకున్నాడు. కానీ అది సైబర్ నేరగాళ్ల నంబర్. ఆ నంబర్కు ఫోన్ చేసి నెట్ సరిగ్గా రావడం లేదని సమస్య తెలిపాడు. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు… మీ సమస్య అర్థం కావడం లేదు.. మీ కంప్యూటర్లో రిమోట్ డెస్క్టాప్ ఇస్టాల్ చేయండి అంటూ సలహా ఇచ్చాడు.
అది తెలియని అతను… ఇస్టాల్ చేసి.. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చాడు. ఒక అరగంట తర్వాత చూస్తే.. అతని రిటైర్మెంట్ డబ్బులు అన్ని మటుమాయమయ్యాయి. 30 సంవత్సరాల అతని కష్టం 30 నిమిషాల్లో దోచేశారు.
నెటిజన్ కామెంట్కు గట్టి కౌంటర్ ఇచ్చిన అనసూయ