- Advertisement -
పుల్వామా ఘటనతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు మాత్రం తమ ప్రయత్నాలను విరమించుకోవడంలేదు. మరో సారి మిలటరీ క్యాంపే లక్ష్యంగా ఉగ్రమూకలు మరోసారి మందుపాతర పేలుడుకు పాల్పడ్డారు. త్రాల్ దగ్గర ఐఈడీ పేలిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అయితే ఈ పేలుడు నుంచి ఆర్మీ కాన్వాయ్ తృటిలో తప్పించుకుంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. మిలిటరీ క్యాంపు దగ్గర ఈ మందు పాతర పేలింది. దీంతో తీవ్రవాదులు మిలటరీ క్యాంపునే టార్గెట్గా పేలుడు జరిపినట్లు తెలుస్తోంది.