నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తి ఎవరనేదానిపై సందిగ్ధం నెలకొంది. టికెట్ మాకు కావాలంటే మాకని భూమా,శిల్పా వర్గాల మధ్య తీవ్రపోటీ నెలకొంది.ఇరు వర్గాలతో బాబు ఎన్నిసార్లు చర్చలు జరిపినా క్లారిటి రావడంలేదు. మంత్రి పదవిని అఖిలప్రియకు ఇచ్చాం కాబట్టి ..ఉప ఎన్నిక సీటు శిల్పా వర్గానికే కేటాయించారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అభ్యర్తి ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిన అఖిల ప్రియ ..బాబు జోక్యంతో వెనక్కు తగ్గింది. అధిష్టానం తీసుకొనే నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించింది.
అయితే తమ కుటుంబానికే వస్తుందనే ఆశలను వదులుకోవడంలేదు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాల అసెంబ్లీ స్థానం తమకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టికెట్ తమదేనని, ఆ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని అఖిలప్రియ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన కోసం వేచి చూస్తున్నామని ఆమె తెలిపారు. టికెట్పై ఆశలు చావడంలేదు.ప్రస్తుతం నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖను లాభాల్లో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి అఖిలప్రియఅన్నారు. రాయలసీమ జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయని వాటి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో సీఎం చంద్రబాబును కలిశారు. 2014లో పోటీ చేసి ఓడిపోయి తీవ్రంగా నష్టపోయానని, తనకే నంద్యాల సీటు కేటాయించాలని సీఎంను ఆయన కోరారు. అయితే, అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి.. చంద్రబాబు నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తరువాత ఎటువంటి పరినామాలు చోటు చేసుకుంటాయే చూడాలి.
Related