వారిద్దరికి పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు అవుతుంది ,ఇద్దరు పిల్లలు ఉన్నారు.కాపురం సజావుగా సాగుతుంది.ఆలోపు భర్త ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు.అదే సమయంలో గ్రామానికి చెందిన మరో యువకుడితో భార్యకు సాన్నిహిత్యం ఏర్పడింది.వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం చోటు చేసుకుంది. దీంతో వారిద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని భర్తకు ఇంట్లో వారికి చెప్పింది. కోడలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సదరు యువతి మాట్లాడుతూ తన రెండో పెళ్లికి తన భర్త అనుమతించినట్లుగా ఆమె పేర్కొన్నారు.కన్ఫర్మేషన్ కోసం విదేశాల్లో ఉన్న భర్తకు ఫోన్ చేయటం అతను ఓకే చెప్పిన వైనాన్ని చెప్పటంతో అవాక్కు కావటం పోలీసుల వంతైంది. భార్య రెండో పెళ్లికి భర్త అనుమతి ఇవ్వటంతో చేసేదేమీ లేక ఫిర్యాదు చేసిన వారికి నచ్చజెప్పి వారిని పంపారు. ఈ వ్యవహరం అంతా బీహార్లోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
https://www.youtube.com/watch?v=LGY94Ww1dsM