కుకునూర్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య, ఫిలింనగర్లో బ్యూటిషియన్ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది.అయితే వారి మృతిపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసిందని ప్రచారం సాగుతోంది.
శిరీష ఎలా చనిపోయింది? ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? పోలీసు క్వార్టర్స్లో రాజీవ్ కొట్టిన దెబ్బలకు మరణించిందా అనేది మిస్టరీగా మారింది.
{loadmodule mod_custom,GA1}
బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారిన పోస్ట్మార్టం నివేదిక బహిర్గతమైంది. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో శిరీష మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులు.. గురువారం సాయంత్రం నివేదికను పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు.
అయితే బ్యూటీషియన్ శిరీష మరణానికి సంబంధించిన పలు సంచలన విషయాలు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యాయి. మెడపై బలమైన ఒత్తిడి పడటం వల్లే ఆమె చనిపోయిందని రిపోర్టులో షాకింగ్ నిజం వెలుగుచూసింది. ఆమె పెదవి, చెంపలు, తలపై గాయాలున్నాయని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆమె హిప్ భాగంలో కూడా బలమైన గాయమున్నట్టు వెల్లడైంది.
{loadmodule mod_custom,GA2}
శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా?అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసులో శిరీష పోస్ట్మార్టం నివేదికతో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో, శిరీషది ఆత్మహత్య అయితే… ఆమె ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}TI10NKuYZCI{/youtube}