- Advertisement -

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా కలకలం..

- Advertisement -

ఏపిలో కరోనా కలలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ తో 15 మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయింది. 

ఉద్యోగులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసిన పద్మారావు కరోనాతో మృతి చెందడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది.

కాగా, నిన్న సచివాలయంలో 200 మందికి కరోనా పరీక్షలు జరిపింది. ఫలితాలు రావాల్సి ఉండగా.. ఉద్యోగులు వర్కు ఫ్రమ్ హోం నిర్వహించేలా అవకాశం కల్పించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఏపీలో 40,469 యాక్టివ్‌ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు.

లాలూ ప్రసాద్​ యాదవ్​ కు బెయిల్

వాట్సప్‌ వాడే వారి డేటా మొత్తం లీక్..?

బండి సంజయ్ పై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -