- Advertisement -
మధ్యప్రదేశ్ కొత్త గవర్నర్గా గుజరాత్కు చెందిన ఆనందీబెన్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి ఆగస్టు 2016 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆనందీ బెన్ పటేల్ పఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు గుజరాత్ గవర్నర్గా ఉన్న ఓమ్ ప్రకాశ్ కోహ్లీ, మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన స్థానంలో ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మధ్యప్రదేశ్ చీఫ్ జడ్జి హేమంత్ గుప్తా రాజ్భవన్లో ఆనందీబెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆనందీ బెన్ తర్వాత ఆమె స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఎన్నికైన సంగతి తెలిసిందే.