ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ ఈ రోజు తెల్లవారుఝామున చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చినప్పటికీ యన మరణానికి కరోనా కూడా కారణం అని తెలుస్తుంది. ఇటీవల ఆయన కుటుంబంలోని వారికి కరోనా రావడంతో ఆనంద్ కి కూడా కరోనా వచ్చిందని.. దాంతో ఆయన శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు.
కొద్ది సమయానికి గుండె పోటు రావడంతో మరణించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేవీ ఆనంద్ కరోనాతో మరణించడంతో ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు ఆసుపత్రి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
ఇక కరోనా నిబంధనల ప్రకారం ఆనంద్ మృతదేహాన్ని నగర్ ఎలక్ట్రికల్ అంత్యక్రియశాలకు పంపిస్తామని అంటున్నారు. తమ అభిమాన దర్శకుడిని చివరి చూపు చూసుకోలేకపోతున్నం దుకు అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.