Friday, April 19, 2024
- Advertisement -

13న కమల్ హాసన్ ప్రచార శంఖం..!

- Advertisement -

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈనెల 13న ప్రచార శంఖం పూరించనున్నారు మక్కల్​ నీది మయ్యం(ఎంఎన్​ఎం) అధినేత కమల్​ హాసన్. ఈ మేరకు పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్​ ఆర్​ మహేంద్రన్​ ఓ ప్రకటనలో తెలిపారు.డిసెంబర్​ 13 నుంచి 16 వరకు కమల్​ తొలి దశ ప్రచారం చేయనున్నారని వెల్లడించారు మహేంద్రన్​. అందులో భాగంగా.. మధురై, తేని, దిండిగల్​, విరుధునగర్, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి​ జిల్లాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు.

2018 ఫిబ్రవరిలో ఎంఎన్​ఎం​ను ప్రారంభించారు కమల్. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్​ సీటును కూడా గెలవలేకపోయింది.వచ్చే ఏడాది జనవరి చివర్లో గానీ, ఫిబ్రవరి ఆరంభంలో గానీ కమల్​ హాసన్​.. భారతీయుడు 2 షూటింగ్​లో పాల్గొంటారని కోలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్​ త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -