మక్కా మసీదు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెల్లడించిన కాసేపటికే ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంచలనం రేపారు. అయితే ఆయన రాజీనామాను ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తిరస్కరించింది. ఆయన తాత్కాలిక సెలవును కూడా రద్దు చేసింది. దీంతో జస్టిస్ రవీందర్ రెడ్డి గురువారం విధులకు హాజరయ్యారు.
మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి రవీందర్ రెడ్డి ఈ సోమవారం తీర్పు జారీ చేసిన విషయం తెలిసిందే. నాటి పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. తీర్పు తర్వాత జడ్జి రవీందర్ రెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్ కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని అందులో పేర్కొన్నారు. తీర్పుతో దీనికి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.