Friday, April 26, 2024
- Advertisement -

ఈ ఏడాది గూగుల్ లో ఐపీఎల్ టాప్..!

- Advertisement -

భారతీయులకు క్రికెట్ అంటే ఎంత మక్కువో మరోసారి రుజువైంది. ప్రపంచాన్నంతా ఆవహించిన కరోనా సంక్షోభంలోనూ ఈ ఆటకు క్రేజ్ తగ్గలేదని నిరూపితమైంది. గూగుల్​లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీవర్డ్స్ జాబితాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కరోనా వైరస్ పదంతో పోలిస్తే ఐపీఎల్​తోనే ఎక్కువ శోధనలు జరిగాయని గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు భారత్​లో అత్యధిక మంది వేటిని సెర్చ్ చేశారనే విషయాలపై జాబితా రూపొందించింది.

క్రీడలు, వార్తల విభాగంలోనూ ఐపీఎల్ కీవర్డే సత్తా చాటింది. ఆ తర్వాత కరోనా వైరస్ నిలిచింది. అమెరికా ఎన్నికల ఫలితాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్ పథకం), బిహార్ ఎన్నికల ఫలితాలు, దిల్లీ ఎన్నికల ఫలితాలు, నిర్భయ కేసు, లాక్​డౌన్, భారత్-చైనా ఉద్రిక్తతలు, రామ మందిరం పదాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.కరోనా కారణంగా తొలుత వాయిదా పడిన ఐపీఎల్ పదమూడో సీజన్.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య నిర్వహించారు. మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే వ్యూయర్​షిప్ మాత్రం రికార్డులు తిరగరాసింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం అధికంగా ఐపీఎల్​ను వీక్షించారు. ఈ సంవత్సరం ఐపీఎల్​ గురించి అత్యధిక మంది వెతికితే 2019లో ‘ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్’ గురించి భారతీయులు ఎక్కువగా శోధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -