ఏపీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ తనయుడు నిషిత్ కొన్ని రోజుల క్రితం జరిగిన అత్యంత ఘోర ప్రమాదంలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన ముగ్గురు నలుగురు పార్టీ సన్నిహితుల్లో ఒకరైన నారాయణ కు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షణం తీరికలేదు.
దీంతో ఇప్పుడిప్పుడే నిషిత్ తమ విద్యా సంస్థల బాధ్యతలను ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాడు. ఏకైక కుమారుడైన నిషిత్ విద్యా సంస్థలను పూర్తిగా రన్ చేయడంతో పాటుగా తన తర్వాత రాజకీయ వారసుడిగా చేయాలని నారాయణ ఎన్నో కలలు కన్నాడు. అయితే విధి మాత్రం ఆయనను యాక్సిడెంట్ రూపంలో వంచించింది. పాతికేళ్లయినా నిండకుండానే కుమారుడికి నూరేళ్లూ నిండాయి. కుటుంబ సభ్యులైతే ఇంకా ఇప్పటికీ శోక సంద్రం నుంచి తేరుకోలేదు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇక చేతికి అందివచ్చిన కొడుకు ఒక్కసారిగా కనుమరుగై పోవడంతో నారాయణ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తన కుమారుణ్ణి కభలించిన మెట్రో పిల్లర్ ను ఇంతకూ నారాయణ ఏం చేశారో తెలుసా? నిషిత్ మరణం తర్వాత నిద్ర లేచిన అధికారులు.. ఆ పిల్లర్లకు రేడియం స్టీకర్స్ అమర్చారు. మరో ప్రమాదం జరగకుండా.. జగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పని ముందే చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. ఏది ఏమైన అతివేగం వల్ల ప్రాణాలు పోతున్నాయి.. కాబట్టి ఏంత పని ఉన్న నెమ్మదిగా వెళ్ళడం ఉత్తమం.
{youtube}JZCpp4vAtDw{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
