ఇన్నాల్లు భర్తల చేతి భార్యలు చనిపోతున్న సంఘటనలలే ఎక్కువగా జరిగేవి .కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. భార్తల చేతుల్లో అమాయకులైన భర్తలు చినిపోతున్న సంఘటనలు సమాజంలో పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, ఇష్టంలేని పెళ్లిల్ల కారనంగా భార్యలు బరితెగించేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేశారనే కారనంగా ఓ నవ వధువు భర్తను స్నేహితుడితో కలిసి హత్య చేయించిన ఘటన ఉత్తరాంధ్రలో కలకలం రేపింది. బైక్పై వెళ్తున్న నవదంపతులపై ముగ్గురు వ్యక్తులు సోమవారం రాత్రి దాడిచేసిన ఘటనలో వధువు భర్త మరణించాడన్న విషయం తెలిసిందే. అయితే ప్లాన్ ప్రకారమే భర్త శంకర్ రావుపై భార్య దాడి చేయించిన ఉదంతం బయటపడింది
శ్రీకాకుళం జిల్లా చిట్టిపుడి వలసకు చెందిన గౌరీ శంకర రావుకు పది రోజుల క్రితం సరస్వతితో పెళ్లయ్యింది. కానీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సరస్వతి తన స్నేహితుడైన శివతో చెప్పింది. దీంతో విశాఖకు చెందిన రౌడీషీటర్లతో సాయంతో వీరిద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దారి కాసి హత్య చేయించారు. నగల కోసం దోపీడీ దొంగలు చేసిన హత్యగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
నవ దంపతులిద్దరూ సోమవారం సాయంత్రం సరదాగా బయటకెళ్లారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్ట్ సమీపంలోని పార్క్ దగ్గర్నుంచి మోటార్ సైకిల్పై వెళ్తుండగా.. దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గౌరీశంకర్ మరణించారు.
గాయపడిన సరస్వతిని పోలీసులు ఆసుపత్రిలో విచారించగా.. ఆమె తనకేమీ తెలియదని చెప్పింది. కానీ మృతుడి పర్సులో నగదు అలాగే ఉండటం, సరస్వతికి పెద్దగా గాయాలు కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య చేసిన గోపీ గ్యాంగ్ను పట్టుకున్న పోలీసులు విచారించగా.. భార్యే ఈ హత్య చేయించిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సరస్వతి గతంలో విశాఖలో పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న సమయంలో శివతో పరిచయమైనట్లు తెలుస్తోంది. సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.