Tuesday, April 23, 2024
- Advertisement -

కులభూషణ్ జాదవ్ ని మరో కేసులో ఇరికిస్తున్న పాక్..!

- Advertisement -

పాకిస్థాన్​ చెరలో ఉన్న భారత నావికాదళ మాజీ అధికారి కుల​భూషణ్​ జాదవ్​ను సంబంధం లేని మరో కేసుతో ముడిపెడుతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీ వాస్తవ మీడియాతో మాట్లాడారు.

గూఢచర్యం ఆరోపణలతో జాదవ్​కు పాక్ కోర్టు మరణశిక్ష విధించగా..అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో శిక్ష నిలిపివేసిన విషయం తెలిసిందే. మహమ్మద్ ఇస్మాయిల్​ అనే భారతీయుడు పాక్​లో జైలు శిక్ష పూర్తి చేసుకున్నా ఇంకా విడుదల కాలేదు.

అతన్ని భారత్​కు అప్పగించాలన్న విషయమై వాదించేందుకు పాక్​లోని భారత హైకమిషన్​..షానజాన్​ నూన్​ను న్యాయవాదిగా నియమించింది. ఇస్లామాబాద్​ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని జాదవ్ ప్రస్తావన తీసుకొచ్చారు.​ జాదవ్​ తరఫున న్యాయవాది నియామకంపై భారత్​ తన వైఖరి చెప్పాలనుకుంటోందంటూ షానవాజ్​ ప్రకటించారు. పాక్ అధికారుల ఒత్తిడి మేరకే అతనిలా మాట్లాడినట్టు తెలుస్తోంది.

Also Read

చైనా పై బైడెన్ కొత్త ప్లాన్..?

పంజాబ్ లో టీకా ఆయనకే ముందు..!

ప్రాణం తీసిన ఆక్సిజన్ సిలిండర్..!

శశికళ జైలు శిక్షలో కుదింపు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -