Tuesday, May 21, 2024
- Advertisement -

కేసీఆర్‌, పవన్ ఒకే దగ్గర కలుస్తున్నారు!

- Advertisement -

టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలవనున్నారని తెలుస్తోంది. ఒకే కార్యక్రమంలో ఇద్దరు కలుసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే సమస్యల పరిష్కారం గురించి మాట్లాడుకునేందుకు కాదని అంటున్నారు.

గ్రాండ్ గా జరగనున్న ఓ సినిమా ఆడియో పంక్షన్లో ఈ ఇద్దరు నేతలు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ “జాగ్వార్” సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. 75 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో రిలీజ్ సెప్టెంబర్ 18న నిర్వహించనున్నారు.

ఈ ఆడియో వేడుకకు రావాలని కొద్దిరోజుల క్రితం కుమారస్వామి పవర్ స్టార్ ని కలిసి ఆహ్వానించారు. పవన్ కూడా వస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పవన్‌ను కలిసిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఆడియో విడుదలకు రావాలని కోరారు. కేసీఆర్‌ కూడా అంగీకరించినట్లు సమాచారం. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో హీటెక్కిన పరిస్థితుల్లో పవన్, కేసీఆర్ లు ఒకే కార్యక్రమంలో కలవనుండడం అందరికి ఆసక్తి కలిగిస్తోంది.

Related

  1. ఆ హీరోయిన్ ని బాధపెడుతున్న పవన్!
  2. పవన్ కళ్యాణ్ ఒక పక్షి – కేటీఆర్
  3. పవన్ స్పీచ్ హై లైట్స్
  4. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -