ప్రముఖ సినీ నిర్మత అల్లు అరవింద్ కరోనా బారినపడ్డారు. అయితే, ఇటీవలే ఆయన రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నప్పటికీ కరోనా మహమ్మారి బారినపడ్డారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనితో పాటు ఆయనకు సంబంధించి పలు విభిన్న రకాలైన వార్తలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ స్పందించారు.
అల్లు అరవింద్ ఆయన కరోనా సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తనకు కరోనా సోకిన విషయం నిజమేనని తెలిపారు. ఆ వీడియోలో “అందరికీ నమస్కారం.. నాకు కరోనా వచ్చిందంటూ వస్తున్న వార్తలపై స్పందించటం కోసమే మీ ముందుకు వచ్చాను. నాకు కరోనా వచ్చిన మాట నిజం. అయితే, రెండు వ్యాక్సిన్ డోస్ల తర్వాత కూడా నాకు కరోనా వచ్చినట్టు పలువురు రాస్తున్నారని”పేర్కొన్నారు.
అలాగే, తను కరోనా టీకా తీసుకున్న తర్వాత ముగ్గురు స్నేహితులం కలిసి ఊరెళ్లి వచ్చామనీ, ఈ క్రమంలోనే తమకు కరోనా సోకిందని తెలిపారు. ముగ్గురిలో ఇద్దరం కరోనా టీకా వేయించుకున్నామనీ, ఒకరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదనీ, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.
జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి
కొండెక్కిన కోడి.. కరోనానే కారణమా?
ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి
కరోనా టెర్రర్.. ఒకే రోజు లక్ష మందికి పాజిటివ్
క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ !